పాండవులు అడవికి వెళ్ళినప్పుడు, కొంతమంది బ్రాహ్మణులు తమ బంధువులతో కలిసి పాండవులను అనుసరిస్తారు. పాండవులే అరణ్యవాసంలో ఉన్నప్పుడు వారిని ఎలా పోషించాలో అని యుధిష్ఠరుడు ఆందోళన చెందుతాడు. పాండవుల పురోహితుడు ధౌమ్యుడు, సూర్యుడు అందరికీ ఆహారం అందిస్తాడని యుధిష్ఠరుడికి చెప్పి, సూర్యుని ప్రార్ధించమని చెపుతాడు యుధిష్ఠరుడు దివాకర పూజ చేస్తాడు. సంతోషించిన సూర్యుడు యుధిష్ఠరుడి ముందు ప్రత్యక్షమై, అక్షయ పాత్ర ఇచ్చి, పాండవుల వంటగదిలో నాలుగు రకాల ఆహారాలైన పండ్లు, దుంపలు, మాంసం మరియు కూరగాయలుకు కొరత ఉండదని హామీ ఇస్తాడు. మహాభారతం యొక్క విమర్శనాత్మక సంచికలో, అక్షయ పాత్ర ప్రస్తావన లేదు. ఇతర రచనలలో, ప్రసిద్ధ కథల్లో, సూర్యుడు యుధిష్ఠరుడికి అక్షయ పాత్రను బహుమతిగా ఇచ్చి, అది పూర్తిగా ఖాళీ చేయబడే వరకు అంతులేని ఆహారాన్ని అందిస్తుందని చెపుతాడు. తరువాత, దుర్వాస ముని తన పరివారంతో పాండవులను సందర్శించినప్పుడు, ద్రౌపది భయపడుతుంది ఎందుకంటే ఆమె అప్పటికే భోజనం చేసి పాత్రను ఖాళీ చేసింది. ఆమె కృష్ణుడిని ప్రార్థిస్తుంది, కృష్ణుడు అక్షయ పాత్రలో ఇంకా కొద్దిగా ఆహారం మిగిలి ఉండటాన్ని గమనించి ఆ ముద్దను తింటాడు. అద్భుతంగా దుర్వాసముని, అతని శిష్యులు కూడా అదే సమయంలో కడుపు నిండినట్లు భావిస్తారు. మూలం: అర్జున్ భరద్వాజ్ మరియు హరి రవికుమార్. ఎసెన్షియల్ మహాభారత.
Picture – Rock art believed to be Pandavas and Draupadi with Akshaya Patra at Amba Teerth, Karnataka
పాండవులు అడవికి వెళ్ళినప్పుడు, కొంతమంది బ్రాహ్మణులు తమ బంధువులతో కలిసి పాండవులను అనుసరిస్తారు. పాండవులే అరణ్యవాసంలో ఉన్నప్పుడు వారిని ఎలా పోషించాలో అని యుధిష్ఠరుడు ఆందోళన చెందుతాడు. పాండవుల పురోహితుడు ధౌమ్యుడు, సూర్యుడు అందరికీ ఆహారం అందిస్తాడని యుధిష్ఠరుడికి చెప్పి, సూర్యుని ప్రార్ధించమని చెపుతాడు యుధిష్ఠరుడు దివాకర పూజ చేస్తాడు. సంతోషించిన సూర్యుడు యుధిష్ఠరుడి ముందు ప్రత్యక్షమై, అక్షయ పాత్ర ఇచ్చి, పాండవుల వంటగదిలో నాలుగు రకాల ఆహారాలైన పండ్లు, దుంపలు, మాంసం మరియు కూరగాయలుకు కొరత ఉండదని హామీ ఇస్తాడు. మహాభారతం యొక్క విమర్శనాత్మక సంచికలో, అక్షయ పాత్ర ప్రస్తావన లేదు. ఇతర రచనలలో, ప్రసిద్ధ కథల్లో, సూర్యుడు యుధిష్ఠరుడికి అక్షయ పాత్రను బహుమతిగా ఇచ్చి, అది పూర్తిగా ఖాళీ చేయబడే వరకు అంతులేని ఆహారాన్ని అందిస్తుందని చెపుతాడు. తరువాత, దుర్వాస ముని తన పరివారంతో పాండవులను సందర్శించినప్పుడు, ద్రౌపది భయపడుతుంది ఎందుకంటే ఆమె అప్పటికే భోజనం చేసి పాత్రను ఖాళీ చేసింది. ఆమె కృష్ణుడిని ప్రార్థిస్తుంది, కృష్ణుడు అక్షయ పాత్రలో ఇంకా కొద్దిగా ఆహారం మిగిలి ఉండటాన్ని గమనించి ఆ ముద్దను తింటాడు. అద్భుతంగా దుర్వాసముని, అతని శిష్యులు కూడా అదే సమయంలో కడుపు నిండినట్లు భావిస్తారు. మూలం: అర్జున్ భరద్వాజ్ మరియు హరి రవికుమార్. ఎసెన్షియల్ మహాభారత.
Picture – Rock art believed to be Pandavas and Draupadi with Akshaya Patra at Amba Teerth, Karnataka