తొలి బౌద్ధ కళలలో ఖాళీ సింహాసనం బుద్ధుడిని సూచిస్తుంది. క్రీస్తుపూర్వం మొదటి శతాబ్దం వరకు కొనసాగిన బౌద్ధ కళల ప్రారంభ దశలో, బుద్ధుడిని మానవుడిగా చూపించలేదు. ఖాళీ సింహాసనం, బోధి వృక్షం, గొడుగు కింద రౌతులేని గుర్రంమధ్య ఖాళీ స్థలం, బుద్ధుని పాద ముద్రలు మరియు ధర్మ చక్రం వంటి చిహ్నాల ద్వారా ఆయనను చూపించారు. సింహాసనం సిద్ధార్థ గౌతముని రాజ వంశపు వారసత్వాన్ని కూడా సూచిస్తుంది. తరువాత కాలం లొ ఇది మారిపోయి బుద్ధుని చిత్ర రూపం చాలా ప్రాచుర్యం పొందింది. కొందరు బుద్ధుడిని మానవుడిగా చూపించడానికి అనుమతి లేదని వాదిస్తే, మరికొందరు, ఆ కాలంలో బుద్ధుడిని మానవ రూపంలో చూపించే ఆచారం లేదని, కానీ అందుకు నిషేధం లేదని వాదిస్తారు. మూలం: క్లెమెన్స్ కార్ల్సన్. బౌద్ధ అనైకానిక్ కళ యొక్క నిర్మాణం. చిత్రం అమరావతి స్థూపం (క్రీ.శ. 1వ శతాబ్దం) నుండి తీసుకోబడింది, ఇది ఖాళీ సింహాసనం మరియు ధర్మ చక్రాన్ని సూచిస్తుంది.
తొలి బౌద్ధ కళలలో ఖాళీ సింహాసనం బుద్ధుడిని సూచిస్తుంది. క్రీస్తుపూర్వం మొదటి శతాబ్దం వరకు కొనసాగిన బౌద్ధ కళల ప్రారంభ దశలో, బుద్ధుడిని మానవుడిగా చూపించలేదు. ఖాళీ సింహాసనం, బోధి వృక్షం, గొడుగు కింద రౌతులేని గుర్రంమధ్య ఖాళీ స్థలం, బుద్ధుని పాద ముద్రలు మరియు ధర్మ చక్రం వంటి చిహ్నాల ద్వారా ఆయనను చూపించారు. సింహాసనం సిద్ధార్థ గౌతముని రాజ వంశపు వారసత్వాన్ని కూడా సూచిస్తుంది. తరువాత కాలం లొ ఇది మారిపోయి బుద్ధుని చిత్ర రూపం చాలా ప్రాచుర్యం పొందింది. కొందరు బుద్ధుడిని మానవుడిగా చూపించడానికి అనుమతి లేదని వాదిస్తే, మరికొందరు, ఆ కాలంలో బుద్ధుడిని మానవ రూపంలో చూపించే ఆచారం లేదని, కానీ అందుకు నిషేధం లేదని వాదిస్తారు. మూలం: క్లెమెన్స్ కార్ల్సన్. బౌద్ధ అనైకానిక్ కళ యొక్క నిర్మాణం. చిత్రం అమరావతి స్థూపం (క్రీ.శ. 1వ శతాబ్దం) నుండి తీసుకోబడింది, ఇది ఖాళీ సింహాసనం మరియు ధర్మ చక్రాన్ని సూచిస్తుంది.