61

భారతదేశ భక్తి సాధువులు క్విజ్

ఈ రోజు భక్తి పరంపరకు చెందిన ప్రముఖ కవి కబీర్ దాస్ జయంతి. భక్తి అంటే భగవంతుడిపై లోతైన శ్రద్ధ, అనురాగం – ఈ భావన పురాతనమైనది. భక్తిని ఈశావాస్యోపనిషతు మరియు భగవద్గీత ప్రశంసించాయి. భక్తి కవిత్వం, క్రీస్తు శకం 6వ శతాబ్దంలో తమిళ ప్రాంతంలో ఆవిర్భవించి, ఆ తర్వాత భారత దేశం అంతటా వ్యాపించిందని ప్రతీతి.
ఒక సంస్కృత శ్లోకం ప్రకారం :
“ద్రావిడదేశే జాతా, కర్ణాటకే పక్వతామ్ గతా, మహారాష్ట్రే యువతీ భూత్వా, గుజరాతే వృద్ధతామ్ గతా, వ్రిందావనే బాలికా జాతా।”
(అనువాదం: భక్తి ద్రావిడ దేశంలో జన్మించింది, కర్ణాటకలో పరిపక్వత సాధించింది, మహారాష్ట్రలో యువతిగా మారింది, గుజరాత్‌లో వృద్ధురాలై, చివరికి వృద్ధావనానికి చేరి మళ్లీ బాలికలా పునర్జన్మను పొందింది.)
ఈ 12 ప్రశ్నల క్విజ్ ద్వారా మన దేశoలోని భక్తి కవులు, భక్త సంతుల గురించి తెలుసుకోబోతున్నాం. రచయిత ఆండ్రూ షెల్లింగ్ సంకలనం చేసిన ఉత్తమ భక్తి కవితల సంకలనం ఆధారంగా, ఈ క్విజ్‌ లోని ప్రశ్నలు రూపొందించాము. ఇందులో పాల్గొన్న ఐదుగురు అదృష్టవంతులకు బిబేక్ దేవ్‌రాయ్ రచించిన “భగవద్గీతా ఫర్ మిలెనియల్స్” అనే పుస్తకం బహుమతిగా గెలుచుకునే అవకాశం ఉంది.

6వ నుండి 10వ శతాబ్దం మధ్యలో తమిళ ప్రాంతంలో వైష్ణవ సంప్రదాయంలో తమ భక్తి కవిత్వం మరియు పాశురాలతో ప్రసిద్ధి చెందిన భక్తులు ఎవరు?

అక్క మహాదేవి 12వ శతాబ్దపు వీరశైవ భక్తురాలు. ఆమె అసాధారణమైన ‘వచనాలు’ సమాజాన్ని ధిక్కరించే కవిత్వంగా ప్రసిద్ధి పొందాయి. ఆమె ఏ భాషలో రచనలు చేశారు ?

1300ల కాలంలో జీవించిన లాల్ దేడ్ లేదా లాల్లా, హిందువులు మరియు ముస్లిములు ఇద్దరు తమ భక్తి సంతులుగా ఒప్పుకున్న మొదటి సంతులలో ఒకరు. ఆమె ఏ ప్రాంతంలో జీవించారు?

శ్రీకృష్ణ దేవరాయల అష్టదిగ్గజ్జాలలో ఒకరైన 16వ శతాబ్దంకి చెందిన ధూర్జటి కవి, తిరుపతి సమీపంలోని శ్రీకాళహస్తి ఆలయానికి భక్తితో తన రచనలు అంకితం చేశారు. ఈ ఆలయం ఏ దేవుడికి అంకితమైనది ?

ఈ కింది భక్తులలో ఎవరు మహారాష్ట్ర లోని ప్రసిద్ధి చెందిన వార్కరీ భక్త సంప్రదాయానికి చెందని వారు ఎవరు?

సామాజిక మూఢ నమ్మకాలపై విమర్శతో గుజరాతీలో కవిత్వం రాసిన అఖా భాగత్ లేదా అఖో తన ఆరు పంక్తుల కవితలను ఏమని పిలిచేవారు?

కృష్ణునిపై తన మధురమైన కవితలతో ప్రసిద్ధి చెందిన అంధ భక్తి కవి మరియు గాయకుడైన సూరదాస్, ఏ ఉత్తర భారతీయ బాషా మాండలికంలో తన రచనలను రచించారు?

ఇటీవల ప్రధాన మంత్రి మోదీ తన ప్రసంగం లో మాట్లాడుతూ ప్రజలకి ఆహారం మరియు సమానత్వాన్ని కల్పించే బాధ్యత నాయకుడిదే అని” ఒక ప్రముఖ దళిత కవి మాటలను ప్రస్తావించారు. ఆ కవి ఎవరు ?

అక్బర్ ఆస్థానం లోని నవరత్నాలలో ఒకరు, హిందీ ప్రజలలో ఇప్పటికీ ప్రాచుర్యం పొందిన భక్తి కవిత్వం రాసిన వారు ఎవరు?

బెంగాల్ ప్రాంతం లో ఊరూరా సంచరిస్తూ , కుల మత అంతర్యాలను చెరిపివేయమని దేవుడి కీర్తనలను పాడే గాయకుల బృందం ఏది ?

కబీర్ మరణించినప్పుడు, హిందువులు మరియు ముస్లింలు ఆయన అంత్యక్రియలను జరిపించడానికి పోట్లాడారు. అప్పుడు ఆయన భౌతికకాయం మాయమై ఏమి కనిపించిందని చెప్పబడింది?

భక్తి కవిత్వాలు రాయడానికి, “భానుసింహ” అనే కలం పేరు ఉపయోగించిన గొప్ప బెంగాలీ సంఘ సంస్కర్త ఎవరు?

నిష్క్రమించు

How did you like this quiz?

Get quiz links

We will send you quiz links at 6 AM on festival days. Nothing else 

Opt In