రచయిత కింకాయిడ్ ఉద్దేశ్యంలో కాళిదాసు కావ్యము “మేఘసందేశము లేక మేఘదూతము” ఇతర ఏ భాషలలో రాని అత్యుత్తమ ప్రేమ సందేశ కావ్యము.
ఐశ్వర్యానికి అధిపతి అయిన కుబేరుడు ఎదో కారణం చేత తన ఉద్యోగి అయిన ఒక యక్షుణ్ణి రాజధాని అలకాపురి నుండి మధ్యభారత దేశంలోని ఒక పర్వతము మీదకి బహిష్కరిస్తాడు. ఒంటరిగా, దిగులుతో ఉన్న ఆ యక్షుడు తన ప్రేమను అలకాపురిలో ఉంటున్న తన ప్రేయసికి మేఘము ద్వారా తెలియపరచే భావనలే “మేఘసందేశ” కావ్యం. సీత ఎడబాటుచే బాధపడుతున్న రాముని వర్ణించిన వాల్మీకి రచనలచే ప్రభావితుడైన కాళిదాసు ప్రియుని సందేశాన్ని మోసుకువెడుతున్న మేఘాన్ని నెమ్మదిగా ప్రయాణించమని, జనావాసాలపై వర్షాన్ని కురిపించమని, వనాలలోని కార్చిచ్చులను ఆర్పివేయమని, ప్రతిఒక్కరికి సహాయకారిగా ఉండమని ప్రార్ధిస్తాడు.
యక్షుని, ప్రకృతి ప్రతీక అయిన మేఘము మధ్య జరిగే ఊహాత్మక సంభాషణను ప్రేమకావ్యంగా మహాకవి కాళిదాసు అత్త్యుత్తమముగా వర్ణించాడు. షేక్స్పియర్ రచించిన “పిచ్చివాడు, ప్రియుడు, కవి” (The lunatic, the lover and the poet) అనే ఒక కావ్య రచనలో ఈ భావనలే ఉదహరించినట్టు సాహిత్యకారులు భావిస్తారు. “మందక్రాంతము” అని చెప్పబడే ఒక సంస్కృత సాహితీ లక్షణములో ఈ “మేఘసందేశం” కావ్యము రాయబడినట్టుగా పండితులు భావిస్తారు.
అబనింద్రనాథటాగోర్ వేసిన బహిష్కృతయక్షుడు చిత్రము
మూలము: K S రామస్వామిశాస్త్రి రచించిన కాళిదాసు – రచనలు, పద్యాలు పుస్తకము.
రచయిత కింకాయిడ్ ఉద్దేశ్యంలో కాళిదాసు కావ్యము “మేఘసందేశము లేక మేఘదూతము” ఇతర ఏ భాషలలో రాని అత్యుత్తమ ప్రేమ సందేశ కావ్యము.
ఐశ్వర్యానికి అధిపతి అయిన కుబేరుడు ఎదో కారణం చేత తన ఉద్యోగి అయిన ఒక యక్షుణ్ణి రాజధాని అలకాపురి నుండి మధ్యభారత దేశంలోని ఒక పర్వతము మీదకి బహిష్కరిస్తాడు. ఒంటరిగా, దిగులుతో ఉన్న ఆ యక్షుడు తన ప్రేమను అలకాపురిలో ఉంటున్న తన ప్రేయసికి మేఘము ద్వారా తెలియపరచే భావనలే “మేఘసందేశ” కావ్యం. సీత ఎడబాటుచే బాధపడుతున్న రాముని వర్ణించిన వాల్మీకి రచనలచే ప్రభావితుడైన కాళిదాసు ప్రియుని సందేశాన్ని మోసుకువెడుతున్న మేఘాన్ని నెమ్మదిగా ప్రయాణించమని, జనావాసాలపై వర్షాన్ని కురిపించమని, వనాలలోని కార్చిచ్చులను ఆర్పివేయమని, ప్రతిఒక్కరికి సహాయకారిగా ఉండమని ప్రార్ధిస్తాడు.
యక్షుని, ప్రకృతి ప్రతీక అయిన మేఘము మధ్య జరిగే ఊహాత్మక సంభాషణను ప్రేమకావ్యంగా మహాకవి కాళిదాసు అత్త్యుత్తమముగా వర్ణించాడు. షేక్స్పియర్ రచించిన “పిచ్చివాడు, ప్రియుడు, కవి” (The lunatic, the lover and the poet) అనే ఒక కావ్య రచనలో ఈ భావనలే ఉదహరించినట్టు సాహిత్యకారులు భావిస్తారు. “మందక్రాంతము” అని చెప్పబడే ఒక సంస్కృత సాహితీ లక్షణములో ఈ “మేఘసందేశం” కావ్యము రాయబడినట్టుగా పండితులు భావిస్తారు.
అబనింద్రనాథటాగోర్ వేసిన బహిష్కృతయక్షుడు చిత్రము
మూలము: K S రామస్వామిశాస్త్రి రచించిన కాళిదాసు – రచనలు, పద్యాలు పుస్తకము.