మరాఠాలు మరియు అహిల్యాబాయి అన్ని రంగాలలో హిందూ మత పునరుద్ధరణను ప్రోత్సహించారు. అయితే తీర్థయాత్రా కేంద్రాల పునరుద్ధరణకు అహిల్యాబాయి చేసిన కృషి ప్రముఖంగా కనిపిస్తుంది. సుమారు ఏడు శతాబ్దాల విదేశీ దురాక్రమణలలో భారతదేశంలోని అనేక తీర్థయాత్రా స్థలాలు నాశనం చేయబడ్డాయి. హిందూ సమాజం, సంస్థల పునర్నిర్మాణంలో మరాఠాలు కీలక పాత్ర పోషించారు. వారిలో అహిల్యాబాయి అత్యుత్తమ ప్రతినిధి. ఆమె ధార్మిక కార్యకలాపాలతో, అనేక దేవాలయాల పునర్నిర్మాణం, తీర్థాలలో స్నానానికి ఘాట్లు, యాత్రికుల వసతికై సత్రాలు, మంచి నీటి సౌకర్యం కల్పించింది. మల్హర్ రావు బ్రతికి ఉన్నప్పుడు, అహిల్యాబాయి అనేక తీర్థయాత్ర స్థలాలను సందర్శించి, ప్రజలు భరించే ఖర్చులు, వారు ఎదుర్కొన్న కష్టాల గురించి ఆమె తెలుసుకుంది . ఆమె తీర్థయాత్ర సౌకర్యాల పునరుద్ధరణ కోసం తన వ్యక్తిగత సంపదను ఖర్చు చేసింది. భారతదేశంలోని ప్రతి ప్రధాన తీర్థయాత్రా కేంద్రం అహిల్యాబాయి యొక్క ఉదారత మరియు ప్రజా సేవానిర్పరతను ప్రతిఫలిస్తుంది. భారత స్వాతంత్ర్యం తరువాత అహిల్యాబాయి తన వ్యక్తిగత సంపదతో సృష్టించిన ఆస్తులను నిర్వహించడానికి ఒక ట్రస్టు ఏర్పడింది. ఈ ఆస్తుల దుర్వినియోగాన్ని, అనధికార విక్రయాన్ని నివారించడానికి 2012లో, లోక్సభ మాజీ స్పీకర్ మరియు ఇందోర్ లోక్ సభ సభ్యురాలు శ్రీమతి సుమిత్రా మహాజన్ ఫిర్యాదు చేశారు. ఫలితంగా, మధ్యప్రదేశ్ ప్రభుత్వం, తరువాత హైకోర్టు మరియు సుప్రీంకోర్టు ఆ ఆస్తులను అనధికార విక్రయం నుండి రక్షించాయి.
మరాఠాలు మరియు అహిల్యాబాయి అన్ని రంగాలలో హిందూ మత పునరుద్ధరణను ప్రోత్సహించారు. అయితే తీర్థయాత్రా కేంద్రాల పునరుద్ధరణకు అహిల్యాబాయి చేసిన కృషి ప్రముఖంగా కనిపిస్తుంది. సుమారు ఏడు శతాబ్దాల విదేశీ దురాక్రమణలలో భారతదేశంలోని అనేక తీర్థయాత్రా స్థలాలు నాశనం చేయబడ్డాయి. హిందూ సమాజం, సంస్థల పునర్నిర్మాణంలో మరాఠాలు కీలక పాత్ర పోషించారు. వారిలో అహిల్యాబాయి అత్యుత్తమ ప్రతినిధి. ఆమె ధార్మిక కార్యకలాపాలతో, అనేక దేవాలయాల పునర్నిర్మాణం, తీర్థాలలో స్నానానికి ఘాట్లు, యాత్రికుల వసతికై సత్రాలు, మంచి నీటి సౌకర్యం కల్పించింది. మల్హర్ రావు బ్రతికి ఉన్నప్పుడు, అహిల్యాబాయి అనేక తీర్థయాత్ర స్థలాలను సందర్శించి, ప్రజలు భరించే ఖర్చులు, వారు ఎదుర్కొన్న కష్టాల గురించి ఆమె తెలుసుకుంది . ఆమె తీర్థయాత్ర సౌకర్యాల పునరుద్ధరణ కోసం తన వ్యక్తిగత సంపదను ఖర్చు చేసింది. భారతదేశంలోని ప్రతి ప్రధాన తీర్థయాత్రా కేంద్రం అహిల్యాబాయి యొక్క ఉదారత మరియు ప్రజా సేవానిర్పరతను ప్రతిఫలిస్తుంది. భారత స్వాతంత్ర్యం తరువాత అహిల్యాబాయి తన వ్యక్తిగత సంపదతో సృష్టించిన ఆస్తులను నిర్వహించడానికి ఒక ట్రస్టు ఏర్పడింది. ఈ ఆస్తుల దుర్వినియోగాన్ని, అనధికార విక్రయాన్ని నివారించడానికి 2012లో, లోక్సభ మాజీ స్పీకర్ మరియు ఇందోర్ లోక్ సభ సభ్యురాలు శ్రీమతి సుమిత్రా మహాజన్ ఫిర్యాదు చేశారు. ఫలితంగా, మధ్యప్రదేశ్ ప్రభుత్వం, తరువాత హైకోర్టు మరియు సుప్రీంకోర్టు ఆ ఆస్తులను అనధికార విక్రయం నుండి రక్షించాయి.